జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. శనివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పోలీసు సోదరుల కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. నేరాలు చేస్తున్న వారిని ఎదుర్కొవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. మారుతున్న సవాల్లకు సమాధానం చెప్పడానికి సిద్ధం కావాలన్నారు. పోలీసు ఉద్యోగమే ఓ సవాల్ అని, ప్రతి యేటా అక్టోబర్ 21న పోలీసు అమరుల సంస్మరణ దినం జరుపుకొంటున్నామని, గడిచిన 64 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అంగళ్లలో ప్రతిపక్ష పార్టీ పోలీసుపై దాడి చేయించిందని, పుంగనూరు అల్లర్లలో ఓ పోలీసు కన్ను కోల్పోయారని అన్నారు. పుంగనూరు అల్లర్లలో 40 మంది పోలీసులకు గాయాలయ్యాయన్నారు. పుంగనూరులో ప్రతిపక్ష పార్టీ శాంతి భద్రతలకు విఘాతం కలిగించిందన్నారు. కోటి 25 లక్షల మంది అక్కా చెల్లెమ్మల మొబైల్ ఫోన్లలో దిశ యాప్ ఉందన్నారు. న్యాయమూర్తులపై కూడా ట్రోలింగ్ చేస్తున్నారని, ట్రోలింగ్ చేసే దుష్టశక్తులను ధీటుగా ఎర్కొవాలని సీఎం జగన్ సూచించారు. ఒకప్పుడు హోంగార్డు జీతం రూ.12000, ఇప్పుడు రూ.21,300కు చేరిందన్నారు.
Admin