జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగానికి 9 ఏళ్లపాటు సేవలు అందించిన పోలీస్ శునకం జెస్సీ మృతి చెందింది. జిల్లా ఎస్సీ రిషాంత్ రెడ్డి ఆదేశాలతో జెస్సీకి ఘనంగా దహన క్రియలు నిర్వహించారు. దహన క్రియలను ఘనంగా నిర్వహించింది చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగం. చిత్తూరులోని డాగ్ స్క్వాడ్ విభాగంలో జెస్సీ సేవలు అందించింది. సుమారు 9 ఏళ్లపాటు పోలీస్ డిపార్ట్మెంట్కు సేవలందించిన జెస్సీ ఆదివారం తుది శ్వాస విడించింది. జెస్సీ మరణంతో పోలీసులు కంటతడి పెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ జి.నాగేశ్వర రావు గారి పర్యవేక్షణలో డాగ్ స్క్వాడ్ యూనిట్లో దహన క్రియలను నిర్వహించారు. జెస్సీకి శాలువా కప్పి పూల మాలలు వేశారు. అనంతరం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు జెస్సీ చేసిన సేవలను కొనియాడారు. పోలీస్ విధుల్లో జెస్సీ చేసిన సేవలను కొనియాడారు. ఎన్నో కేసుల దర్యాప్తుల్లో జెస్సీ చేసి సేవలను పోలీసులు ఈ సందర్భంగా గుర్త చేసుకున్నారు. జెస్సీ 2014 మార్చి 22న జన్మించింది. బ్రెడార్ జాతికి చెందిన ఈ స్నఫ్ఫెర్ డాగ్ చిత్తూరు పోలీసు డిపార్ట్మెంట్కు 2014 మే 25వ తేదీ నుంచి సేవలందిస్తూ వచ్చింది. సుమారు 9 ఏళ్లపాటు ఈ శునకం సేవలు అందించింది. వీఐపీలు, వీవీఐపీల పాల్గొనే కార్యక్రమాల్లో సెక్యూరిటీ సేవలు అందంచింది. Police Dog ఎన్నో కీలక కేసుల్లో చురుగ్గా సేవలందించి దోషులను పట్టించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక కాణిపాకం, తిరుమల శ్రీవారి బ్రహ్మొత్సవాలు విధుల్లో సంఘవిద్రోహ చర్యల పై ఉక్కు పాదం మోపేలా జెస్సీ సేవలు అందించింది. పలు కీలకమైన కేసుల్లో దర్యాప్తునకు సహకరించింది. ఎన్నికల విధుల్లోనూ చురుగ్గా పాల్గొంది. ఎంతగానో సేవలందించిన జెస్సీ పోలీసు డిపార్టుమెంటులో తనకంటూ ప్రత్యేక గుర్తింపును కూడా సొంతం చేసుకోగా జెస్సీ హాండ్లర్గా హెడ్ కానిస్టేబుల్ వి. శ్రీహరి జెస్సీ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.
Admin