Saturday, 18 May 2024 09:42:18 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఫ్యామిలీ మీద కోపంతో ఎత్తైన కొండెక్కిన వ్యక్తి.. 5 గంటలు కష్టపడి రక్షించిన పోలీసులు

Date : 19 November 2023 08:55 AM Views : 89

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ఓ వ్యక్తి కొండమీద చిక్కుకుపోవడం కలకలం రేపింది. మడకశిర కొండ పైకి వెళ్లిన వ్యక్తి అక్కడ నుంచి కొండ పైకి ఎక్కలేక.. తిరిగి కిందకు దిగలేక మధ్యలోనే ఉండిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిని కొండపై నుంచి దించేందుకు చర్యలు చేపట్టారు. అయితే రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించేటప్పటికే చీకటి పడటంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎత్తైన కొండ కావడంతో వ్యక్తిని కిందికి క్షేమంగా దింపేందుకు పోలీసులకు కష్టపడాల్సి వచ్చింది. అయితే.. అంత పెద్ద కొండపైకి అతను ఎలా ఎక్కడా అని పోలీసులు జుట్టుపీక్కుకున్నారు. ఇదిలావుంటే.. అదే కొండపై గతంలో చిరుత పులులు, ఎలుగుబంట్లు సంచరించడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. ఈ క్రమంలోనే.. క్రూర మృగాలు ఆ వ్యక్తి వద్దకు వెళ్లకుండా.. అతనికి దగ్గర్లో హై మాస్క్ లైట్లతోపాటు.. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు పోలీసులు. అనంతరం దాదాపు ఐదు గంటల రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు చిట్ట చివరకు కొండ మీద చిక్కుకున్న వ్యక్తి దగ్గరకు చేరుకున్నారు. అయితే ఆ వ్యక్తిని తాళ్ళ సహాయంతో కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ సమయంలో ఆ వక్తి కాలు జారి కొండ మీద నుంచి కొంత మేర కిందకు జారి పడ్డారు. తలకు గాయం కావడంతో పోలీసులు వెంటనే ఫస్టైడ్ చేశారు. అనంతరం కొండ మీద చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు, స్థానికులు కలిసి సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ఇతడిని కర్ణాటక రాష్ట్రం హెబల్ కు చెందిన హనుమంత గౌడ గా గుర్తించారు పోలీసులు. కొండ మీద నుంచి కిందకు తీసుకొచ్చే క్రమంలో జారి పడి హనుమంత గౌడకు గాయాలవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిచారు. తాపీ పని కోసం హనుమంత గౌడ తన సొంత ఊరు నుంచి మడకశిర వచ్చినట్లు చెప్పారు. ఫ్యామిలీ గొడవలతో ఇంట్లో నుంచి వచ్చేసినట్లు.. అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు చెబుతున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :