జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు చేరింది. సుమారు 40 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి తక్షణ సహాయక చర్యలు చేపట్టి వీలైనంత ఎక్కువ అంబులెన్స్లను పంపించాలని సీఎం ఆదేశించారు. మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించాలని ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ప్రమాదంలో సుమారు 40 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో మంత్రి బోత్స సత్యనారాయణ సందర్శించి వివరాలు తెలుసుకుంటున్నారు. చినరావుపల్లి వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితుల సహాయం కోసం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. బాధితుల సహాయ సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157తో ఫోన్ నంబర్కు సంప్రదించాలని సూచించారు. అలాగే రైల్వే ఫోన్ నంబర్ 8978080006కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. కాగా ఓవర్ హెడ్ కేబుల్ తెగడంతో విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలపై నిలిచిపోయింది. ఆగిపోయిన ప్యాసింజర్ రైలును పలాస ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సంఘటనా ప్రాంతం అంధకారంగా మారింది. కరెంట్ లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని రైల్వే అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు రైలు ప్రమాదం నేపథ్యంలో హెల్ప్ లైన్ నెంబర్నుల కేటాయించారు అధికారులు. 08912746330, 08912744619, 8106053051, 8106053052, 8500041670, 8500041671లకు సహాయం, సమాచారం కోసం సంప్రదించవచ్చు.
Admin