Saturday, 15 February 2025 07:41:52 PM
# ఏకైక బాలికా సంతానం కలిగిన తల్లిదండ్రులకు గుడ్‌న్యూస్‌.. వెంటనే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోండి # మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ఘోర పరాజయానికి ఆ ఐదుగురు కారణమా..? # నీలోఫ‌ర్‌లో శిశువు కిడ్నాప్‌ కేసు సుఖాంతం.. # విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. # డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. # నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం..

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మరో ట్విస్ట్. ఉండవల్లి పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం

Date : 14 October 2023 12:32 PM Views : 212

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో లోతైన విచారణ కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్‌ను విచారణను అనుమతిస్తూ.. ప్రతివాదులుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సహ 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మరో ట్విస్ట్. ఉండవల్లి పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో లోతైన విచారణ కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్‌ను విచారణను అనుమతిస్తూ.. ప్రతివాదులుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సహ 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సెప్టెంబర్ నెలలో ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కీలకమైన ఈ కేసులో అనేక సంక్లిష్టమైన అంతర్రాష్ట్ర అంశాలు ఇమిడి ఉన్నాయని కోర్టుకు వివరించారు. తీవ్ర వరిణామాలతో ముడిపడిన ఆర్థిక నేరం ఇదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ప్రముఖ వ్యక్తులు నిందితులుగా ఉండడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని ఉండవల్లి కోరారు. ఆర్థిక పరమైన నేరం, జీఎస్టీ ఎగవేతపై ఇప్పటికే ఈడీ కూడా విచారణ చేస్తోందని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నవిషయాన్ని తన పిటిషన్‌లో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌, ఈడీ డైరెక్టర్‌, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, APCID, గంటా సుబ్బారావు సహ 44 మందిని ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. ఈడీ, ఐటీ, సీఐడీ విచారణ చేస్తున్న హైప్రొఫైల్‌ కేసు ఇదని ఉండవల్లి తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఈ రిట్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. రిట్‌ నెంబర్‌ 38371/2023గా నమోదు చేసిన రిజిస్ట్రార్‌.మరో వైపు స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని విచారణ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు స్పష్టం చేశారు. ఫైబర్‌నెట్‌, ఇన్నర్‌ రింగ్‌ కేసుల విచారణ కూడా సీబీఐకి అప్పగించాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్న విషయాన్ని కోర్టుకు వివరించారు. దీంతో హైకోర్టు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న 44 మందికి నోటీసులు జారీ చేస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2025. All right Reserved.

Developed By :