Saturday, 18 May 2024 01:41:57 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఏపీ వర్సిటీల్లో 3,282 లెక్చరర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. మరో 2 రోజుల్లో ప్రకటన

Date : 18 October 2023 10:59 AM Views : 69

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి సీఎం జ‌గ‌న్ వేగంగా ముందుకెళ్తున్నారు.. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ‌లో సుమారు 50 వేల‌కు పైగా వైద్యుల‌తో పాటు ప‌లు విభాగాల్లో కొత్తగా నియామ‌కాలు పూర్తి చేసారు. వైద్యరంగంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ హాస్పిట‌ల్స్ రూపు రేఖ‌లు మార్చేస్తున్న జ‌గ‌న్ స‌ర్కార్. అందుకు త‌గ్గట్లుగా ఖాళీల‌ను కూడా భ‌ర్తీ చేస్తూ వ‌స్తుంది. ఇక మిగిలిన శాఖ‌ల్లో కూడా ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల‌ను త్వరిత‌గ‌తిన భ‌ర్తీ చేసేలా చ‌ర్యలు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప్రభుత్వ శాఖ‌ల్లో అవ‌స‌రం త‌ప్పనిస‌రిగా అవ‌స‌రం ఉన్న చోట ఖాళీల‌ను భ‌ర్తీ చేయాల‌ని సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి చ‌ర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే గ్రూప్ -1,గ్రూప్ -2 ఉద్యోగాల భ‌ర్తీకి ఏపీపీఎస్సీకి అనుమ‌తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. త్వర‌లోనే ఉపాధ్యాయ ఖాళీల‌ను కూడా భ‌ర్తీ చేస్తామ‌ని విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యానారాయ‌ణ ప్రక‌టించారు. డీఎస్సీ కంటే ముందుగా టెట్ నిర్వహిస్తామని చెప్పారు. ఇలా ఒక్కొక్క శాఖ‌లో ఖాళీల భ‌ర్తీపై ఫోక‌స్ పెట్టిన ప్రభుత్వం ఉన్నత‌విద్యలో కీల‌క ఉద్యోగాల భ‌ర్తీకి స‌న్నద్దమ‌యింది. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాల‌యాల్లో ఖాళీగా ఉన్న భోద‌నా సిబ్బంది ఉద్యోగాల భ‌ర్తీకి త్వర‌లోనే నోటిఫికేష‌న్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఈనెల 20న నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్న ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాల‌యాల్లో ఏళ్ల త‌ర‌బ‌డి అధ్యాప‌కుల నియామ‌కాలు జ‌ర‌గ‌డం లేదు. యూనివ‌ర్శిటీల్లో శాశ్వత అధ్యాప‌కుల నియామ‌కాలు చేప‌ట్టి 17 ఏళ్లు పూర్తయింది. ఖాళీ అయిన పోస్టుల్లో కాంట్రాక్ట్ ప‌ద్ధతిన టీచింగ్ స్టాఫ్ ను భ‌ర్తీ చేస్తున్నారు. అయితే ఉన్నత‌విద్యారంగంలో స‌మూల‌ మార్పులు తీసుకొస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం యూనివ‌ర్శిటీల్లో క్వాలిటీ విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రాష్ట్రంలో ఉన్న 18 ప్రభుత్వ విశ్వవిద్యాల‌యాల్లో సుమారు 12 ల‌క్షల మంది విద్యార్ధులు చ‌దువుతున్నారు. వీరంద‌రికీ నాణ్యమైన‌, ఆధునిక సాంకేతిక‌తో కూడిన విద్యనందించేలా ముందుకెళ్తున్నట్లు ఉన్నత‌విద్యామండ‌లి ఛైర్మన్ హేమ‌చంద్రారెడ్డి తెలిపారు. యూనివ‌ర్శిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెస‌ర్, అసోసియేట్ ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ల ఉద్యోగాల‌కు ఈనెల 20 న నోటిఫికేష‌న్ జారీ చేస్తున్నట్లు హేమ‌చంద్రారెడ్డి చెప్పారు. మొత్తం 3,282 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేసేందుకు మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ చేతుల‌మీదుగా నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది స‌ర్కార్. Nithari Murder Case: నిఠారీ సీరియల్‌ మర్డర్‌ కేసుల్లో అల్హాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు.. ఉరి శిక్ష రద్దు! యూనివర్సిటీల్లో ఇంత భారీగా నియామ‌కాలు జ‌ర‌గ‌డం ఇదే మొద‌టిసారి. అయితే ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో ప‌నిచేస్తున్న అధ్యాప‌కుల‌కు ప్రత్యేక వెయిటేజి ఇవ్వనుంది ప్రభుత్వం. 3282 పోస్టుల్లో 2600 మంది కాంట్రాక్ట్ ప‌ద్ధతిన ప‌నిచేస్తున్నారు. వీరిలో వెయ్యి మంది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రాం కింద ప‌నిచేస్తున్నారు. ఈ వెయ్యి మంది మిన‌హా మిగిలిన వారికి ప‌ది శాతం వెయిటేజి ఇవ్వనున్నారు. వారు ప‌నిచేస్తున్న స‌ర్వీస్ ఆధారంగా ఏడాదికి ఒక‌టి చొప్పున ప‌దిశాతం వెయిటేజిని లెక్కిస్తారు. వీరంతా మిగిలిన అభ్యర్ధుల మాదిరిగానే రాత‌ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. రాత ప‌రీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్టుకు 12 మందిని ఎంపిక చేయ‌నున్నారు. అక‌డ‌మిక్ ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్టుకు న‌లుగురిని ఎంపిక చేసి తుది జాబితాను సిద్దం చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలు నోటిఫికేష‌న్ లో పేర్కోనుంది ప్రభుత్వం. వీలైనంత త్వర‌గా రిక్రూట్ మెంట్ పూర్తి చేయాల‌ని నిర్ణయం యూనివ‌ర్శిటీల్లో ఖాళీల భ‌ర్తీని ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం న‌వంబ‌ర్ నెలాఖ‌రుకు పూర్తి చేయాల్సి ఉంది. కానీ నోటిఫికేషన్ విడుద‌ల ఆల‌స్యం కావ‌డంతో కాస్త ఆల‌స్యంగా ప్రక్రియ పూర్తి కానుంది. అయితే ఈ నియామ‌కాలు పూర్తయిన త‌ర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీల భ‌ర్తీ చేప‌ట్టే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :