జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడింది. ఇది తీవ్రవాయుగుండంగా మారి, ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తోంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 380 కిలోమీటర్లు, ఒడిస్సా పారాదీప్ కు దక్షిణంగా 380 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్ దిగాకు నైరుతి దిశ గా 530, బంగ్లాదేశ్ ఖేపు పారాకు నైరుతి దిశగా 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా తీవ్రవాయుగుండం క్రమంగా బలపడుతోంది.. నవంబర్ 18వ తేదీ నాటికి ఇది మరింత బలపడి బంగ్లాదేశ్ ఖేపు పార – మోంగ్ల మధ్య తీరం దాటుతుందని ఐఎండి ప్రకటించింది. వాయుగుండం ప్రభావంతో ఒడిస్సా పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీ తీరంలోను బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఏపీలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపధ్యంలో మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
Admin