Saturday, 18 May 2024 10:51:53 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Chandrababu Naidu: ఢిల్లీ టు రాజమహేంద్రవరం.. శుక్రవారం చంద్రబాబుతో లోకేష్‌ ములాఖత్..

Date : 05 October 2023 09:48 PM Views : 103

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : Lokesh to meet Chandrababu Naidu: స్కిల్‌ స్కామ్‌ కేసులో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబరు 19 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అటు బాబు ఫైబర్‌నెట్‌ కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేయగా.. బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు శుక్రవారానికి వాయిదా వేసింది. ఇక 20 రోజుల తర్వాత నారా లోకేష్‌ రాజమండ్రికి వస్తున్నారు. ఆయన ఏం చేయబోతున్నారు..? Chandrababu Naidu: ఢిల్లీ టు రాజమహేంద్రవరం.. శుక్రవారం చంద్రబాబుతో లోకేష్‌ ములాఖత్.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రాజమండ్రి జైలులో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు మరో దఫా రిమాండ్‌ పొడిగించింది. ఈనెల 19వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండో దఫా విధించిన గడువు గురువారం ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు. మరోవైపు జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను రెండు వారాల పాటు పొగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు స్కిల్‌ స్కామ్‌ కేసులోనే చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.శుక్రవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు వెల్లడించింది. ఈ రెండు పిటిషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. విచారణ శుక్రవారానికి వాయిదా స్కిల్‌ కేసుతో చంద్రబాబుకు సంబంధంలేదని ప్రమోద్‌కుమార్‌ దూబే వాదించారు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసులో ఇరికించారని కోర్టుకు వివరించారు. చంద్రబాబు సీఎం హోదాలో మాత్రమే నిధులు మంజూరు చేశారన్నారు. ఇందులో స్కామ్‌ ఎక్కడుంది..? చంద్రబాబు పాత్ర ఏముంది..? ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని దూబే వాదనలు వినిపించారు. స్కిల్‌ కేసు ఒప్పందంలో ఉల్లంఘనలు జరిగాయని సీఐడీ తరఫున పొన్నవోలు వాదనలు వినిపించారు. కేబినెట్‌ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదని, ఆ తప్పిదాలకు చంద్రబాబే బాధ్యత వహించాల్సి ఉందని కోర్టుకు వివరించారు. బ్యాంకు లావాదేవీలపై ఇంకా ఆయన్ను విచారించాల్సి ఉందని చెబుతూ, కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఫైబర్‌నెట్‌ కేసులో తీర్పు రిజర్వ్.. ఇక ఫైబర్‌ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది. ఢిల్లీ నుంచి రాజమండ్రికి నారా లోకేశ్‌.. 20 రోజుల తర్వాత ఢిల్లీ నుంచి రాజమండ్రి విచ్చేసిన టీడీపీనేత నారా లోకేశ్‌ , శుక్రవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్‌ జైలులో చంద్రబాబుతో ములాఖత్ అవుతారు. ఆయనతోపాటు కుటుంబసభ్యులు, పార్టీ నేతలు కూడా చంద్రబాబును కలుస్తారని తెలుస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :