Saturday, 18 May 2024 09:22:45 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నేడు సీఐడీ విచారణకు నారా లోకేష్.. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో విచారణ

Date : 10 October 2023 09:35 AM Views : 71

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : అమరావతి ఇన్న‌ర్ రింగ్ రోడ్ అక్ర‌మాల‌పై సీఐడి ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్నారు నారా లోకేష్. రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులో లోకేష్ ను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమ‌తిచ్చింది. అయితే విచార‌ణ స‌మ‌యంలో కొన్ని నిబంధ‌న‌లు కూడా ఫాలో కావాల‌ని సూచించింది. రింగ్ రోడ్డు కేసులో సీఐడి ఎలాంటి ప్ర‌శ్న‌లు అడిగినా స‌మాధానం చెప్పేందుకు సిద్దంగా ఉన్నాన‌ని లోకేష్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. సీఐడీ ముందు హాజరయ్యేందుకు ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి కుంచనపల్లిలోని సీఐడీ ఆర్థిక నేరాల విభాగం -2 కార్యాలయానికి వెళ్లనున్నారు లోకేష్. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో A 14 గా ఉన్న లోకేష్ అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పులో భారీ అక్ర‌మాలు జ‌రిగాయంటుంది ఏపీ ప్ర‌భుత్వం. ఈ కేసులో చంద్ర‌బాబుతో పాటు నారా లోకేష్ ను కూడా సీఐడీ నిందితులుగా చేర్చింది. ఈ కేసులో లోకేష్ ను ఏ14 గా చేర్చింది సీఐడి. ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు ద్వారా చంద్ర‌బాబు బినామీల‌కు ల‌బ్ది చేకూర్చే విధంగా వ్య‌వ‌హ‌రించార‌నేది సీఐడీ ఆరోప‌ణ‌. ప్ర‌ధానంగా లింగ‌మ‌నేని ర‌మేష్ ఇంటిని క్విడ్ ప్రోకో విధానంలో తీసుకున్నార‌ని సీఐడీ ఆరోపిస్తుంది. ఈ కేసులో లోకేష్ పాత్ర కూడా ఉంద‌ని పేర్కొంది. లోకేష్ పార్ట‌న‌ర్ గా ఉన్న హెరిటేజ్ సంస్థ‌కు ల‌బ్ది చేకూరాల‌నే ఉద్దేశంతోనే రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేసార‌ని చెబుతుంది. దీంతో ఈ కేసును పూర్తి స్థాయిలో విచారించేందుకు సీఐడీ సిద్ద‌మైంది. ముందుగానే నారా లోకేష్ హైకోర్టులో ముంద‌స్తు బెయిల్ కు వెళ్లారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు లోకేష్ కు 41 ఏ నోటీసులు ఇచ్చి విచార‌ణ జ‌రిపాల‌ని ఆదేశించింది.హైకోర్టు ఆదేశాల‌తో ఢిల్లీ వెళ్లిన సీఐడీ అధికారులు నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చి ఈనెల 4న విచార‌ణ‌కు రావాల‌ని సూచించారు. విచార‌ణ‌కు వ‌చ్చే స‌మ‌యంలో హెరిటేజ్ సంస్థ‌ భూముల కొనుగోలుకు సంబంధించిన‌ ప‌లు డాక్యుమెంట్లు కూడా తీసుకురావాల‌ని పేర్కొన్నారు. దీంతో మ‌రోసారి నారా లోకేష్ హైకోర్టులో లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసారు. హెరిటేజ్ సంస్థ‌లో లోకేష్ ఒక పార్ట‌న‌ర్ మాత్ర‌మేన‌ని. ఆ సంస్థ‌కు సంబంధించిన కీల‌క వివ‌రాలు లోకేష్ కు తెలియ‌దంటూ ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టులో వాద‌న‌లు వినిపించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :