Thursday, 23 May 2024 02:17:43 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్..

Date : 12 October 2023 08:37 AM Views : 76

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కాయి. ప్రతిపక్ష పార్టీ టీడీపీ.. అధికార పార్టీ వైసీపీ మధ్య చంద్రబాబు అరెస్టుపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ రాజకీయం హస్తినకు చేరింది. చంద్రబాబు అరెస్టుపై ఆయన తనయుడు.. టీడీపీ నేత నారా లోకేష్.. హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. బుధవారం రాత్రి ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిసిన నారా లోకేష్ చంద్రబాబు అరెస్టు, ఏపీలో రాజకీయ పరిస్థితులపై అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందని.. ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకారం తీర్చుకుంటుందని, చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి.. జైలులో ఉంచారంటూ లోకేష్ అమిత్ షా కు వివరించారు. జైలులో ఉన్న చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని.. ఏపీలో భయంకరమైన పరిస్థితి నెలకొందని.. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని.. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ లోకేష్ అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా.. చంద్రబాబుపై పెట్టిన కేసుల గురించి, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఏపీలో రాజకీయ పరిణామాల గురించి కూడా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం..

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :