జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరు సభలో తీవ్ర విషాదం నెలకొంది. సభలో జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఏడుగురు టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. అమాయకులు చనిపోవడం బాధకరమంటూ పేర్కొన్నారు. బాధితులకు అన్ని విధిలా అండగా ఉంటామని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరు సభకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి కార్యకర్తలు కొందరు పక్కనే ఉన్న గుడంకట్ట ఔట్లేట్ కాలువలో పడిపోయారు. దీంతో వారిని హుటాహుటిన అక్కడినుంచి ఆస్పత్రికి తరలించారు. ఏడుగురు చికిత్స పొందుతు మరణించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో మరికొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాతే ప్రసంగిస్తానంటూ చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కార్యకర్తలు చనిపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తంచేశారు. అండగా ఉంటాం.. లోకేష్ కందుకూరు చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని నారా లోకేష్ ట్విట్ చేశారు. తమ కుటుంబ సభ్యులైన టిడిపి కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటని.. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశామన్నారు. వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని.. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లోకేష్ ట్విట్ చేశారు. కందుకూరు చంద్రబాబు గారి పర్యటనలో అపశ్రుతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మా కుటుంబ సభ్యులైన టిడిపి కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశాం
Admin