జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోరారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో రాజకీయ కక్ష ధోరణి సరికాదని అన్నారు. ఆయన వయస్సును దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని సూచించారు. చంద్రబాబు విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అమానవీయంగా ఉందని విమర్శించారు. డాక్టర్ల నివేదికలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఇదిలావుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు నేరం చేశారు కాబట్టే చట్టం చర్యలు తీసుకుంటుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబుపై కక్ష పెంచుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు అంబటి. చంద్రబాబు తప్పు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని అన్నారు. అందుకే ఎంత మంది సీనియర్ న్యాయవాదులను పెట్టినా బెయిల్ దొరకలేదన్నారు. చంద్రబాబు నేరం చేశారు కాబట్టే చట్టం చర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులే అబద్దాలే అంటున్నారని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజమండ్రి జైలులో ఏసీ ఏర్పాటుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. అంతకు ముందు చంద్రబాబుకు చల్లటి వాతావరణం అవసరమని ప్రభుత్వ వైద్యులు సూచించడంతో పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వివరాలు వెల్లడించారు. చంద్రబాబుకు డేర్మటాలజీ ఉందని, స్కిన్ సమస్యలు మళ్లీ రాకుండా చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వైద్యుల సూచనలను ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియజేస్తున్నామని జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్మోషన్ పిటిషన్పై విచారణ జరిగింది. రూమ్లో ఏసీ ఏర్పాటుకు అనుమతి.. చంద్రబాబు తరపున వాదనలు లూథ్రా వాదనలు వినిపించగా సీఐడీ తరపున వివేకానంద వాదనలు వినిపించారు. వర్చువల్గా విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు జైలులో చంద్రబాబు రూమ్లో ఏసీ ఏర్పాటుకు అనుమతినిచ్చింది. అంతకు ముందు ములాఖాత్లో భాగంగా చంద్రబాబును నారా లోకేశ్, బ్రాహ్మణి, భువనేశ్వరి కలుసుకున్నారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. చంద్రబాబు ఆరోగ్యపరిస్థితి చూశాక వారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారని టీడీపీవర్గాలు తెలిపాయి.
Admin