Saturday, 18 May 2024 10:51:45 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

చంద్రబాబుకు తాత్కాలిక ఊరట.. ఆ కేసుల్లో అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు..

Date : 12 October 2023 08:43 AM Views : 73

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 33 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అయితే, స్కిల్‌ స్కామ్‌ కేసుతో పాటు.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, అంగళ్లు, ఫైబర్‌ నెట్‌ కేసులు సైతం చంద్రబాబును వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో పలు కేసుల్లో విచారణ నిమిత్తం సీఐడీ పీటీ వారెంట్‌ కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే, చంద్రబాబు సైతం ఈ కేసుల్లో ముందస్తూ బెయిల్ కోరుతూ.. హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. వీటిపై గత కొన్ని రోజులుగా న్యాయస్థానాలలో విచారణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు ఐఆర్‌ఆర్, అంగళ్లు కేసుల్లో తాత్కాలిక ఊరట లభించింది. ఐఆర్‌ఆర్‌ కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. IRR కేసులో సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అంగళ్లు కేసులో రేపటివరకు అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు పేర్కొంది. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్‌పై స్టే విధిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల్లో సోమవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ.. ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలతో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో పీటీ వారెంట్‌పై విచారణను ఏసీబీ కోర్టుల వాయిదా వేసింది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు వేసిన రైట్‌ టు ఆడియన్స్‌ పిటిషన్‌ సైతం డిస్మిస్‌ చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. అనంతరం .. ఫైబర్‌నెట్‌ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇరువైపులా వాదనలను న్యాయాధికారి వింటున్నారు. సోమవారం వరకు పీటీ వారెంట్స్‌పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించిందని చంద్రబాబు తరపున లాయర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఫైబర్ కేసులో విచారణ కొనసాగుతుందని తెలిపారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :