Saturday, 18 May 2024 10:36:17 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఇదేందయ్యా ఇదీ..పేద గిరిజనుడి ఇంటి కరెంట్ బిల్లుతో షాక్.. రెండు బల్బులకు లక్ష పైనే..!

Date : 07 November 2023 11:48 AM Views : 68

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఐదుగురు కుటుంబ సభ్యులు నివసిస్తున్న ఓ గిరిజనుడి ఇంటి కరెంట్ బిల్లు వాళ్లకు షాకిచ్చింది.. రెండు గదుల ఆ ఇంటిలో రెండు విద్యుత్ బల్బులు మాత్రమే ఉన్నాయి. ఫ్యాన్, ఫ్రిజ్ వంటి ఏవీ లేవు.. కానీ అతనికి గత నెలలో వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే షాక్ కొట్టి కళ్లు బైర్లు కమ్మినంత పనైంది. వందల్లో రావలసిన కరెంటు బిల్లు.. వేలల్లో దాటి లక్షల్లో వచ్చింది. చాంతాడంత బిల్లును చూసి గుడ్లు తేలేసిన ఆ ఇంటిల్లిపాది షాక్‌కు గురయ్యారు అమాయక గిరిజన రైతులు. ఈ ఘటన ఉమ్మడి విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. అల్లూరి ఏజెన్సీ పాడేరు మండలం వనుగుపిల్లి పంచాయతీ.. చింటగున్నలు గ్రామంలో నివాసం ఉంటున్నాడు పాంగి సుందర రావు . వృత్తి వ్యవసాయం. పేద గిరిజన రైతు అయిన సుందర రావు.. తన ఇంట్లో బల్బులు తప్ప… మరి ఇతర విద్యుత్ ఉపకరణాలు లేవు. టీవీ లేదు.. ఫ్రిడ్జ్ లేదు.. ఫ్యాన్ కూడా వినియోగించడం లేదు. మూడు రెండు బల్బులతోనే జీవనం సాగిస్తుంది ఆ కుటుంబం. అది కూడా రాత్రిపూట మాత్రమే ఆ బల్బులు వినియోగం. – సుందర రావుకు ప్రతినెల.. విద్యుత్ బిల్లు 300 రూపాయలు దాటదు. యూనిట్లు కూడా పదుల్లోనే ఉంటుంది. అది కూడా గిరిజనుడు కావడంతో సబ్సిడీ కూడా వస్తుంది. అయితే.. తాజాగా సుందర రావు చేతికి అందిన కరెంట్ బిల్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వందల నుంచి వేలు దాటిన కరెంట్ బిల్లు ఏకంగా లక్ష దాటేసింది ఆ బిల్లు. ఒకటి కాదు రెండు కాదు పదివేలు కూడా కాదు.. ఏకంగా లక్షా 5వేల 352 రూపాయల..! ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన కరెంటు బిల్లు చూసిన సుందర రావుకు ఒక్కసారిగా షాక్ తగిలినంతపనైంది.. వ్యవసాయంపై ఆధారపడే తాను ఈ లక్షా 5వేల వేల బిల్లు ఎలా చెల్లించేది అంటూ తల పట్టుకున్నాడు ఆ గిరిజన రైతు. – కరెంట్ బిల్లు ఒకసారిగా భారీగా రావడంతో ఆ రైతులో మరో అందోళన మొదలైంది. ఇప్పటికే భారీగా వచ్చిన విద్యుత్ బిల్లుతో గుండె పట్టుకున్న ఆ రైతు.. ఇప్పుడు ఆ బిల్లుతో ప్రభుత్వ పథకాలు కూడా తొలగిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నాడు. అయితే ఇటీవల సిపిఎం రక్షణ భేరి యాత్రలో.. ఈ విషయాన్ని తెలుసుకున్నారు నాయకులు. ఈ బిల్లు వ్యవహారంపై అధికారులు వెరిఫై చేస్తూ ఉన్నారు. అధికారులు కాస్త కనికరించి ఈ గిరిజన పేద రైతు కష్టాన్ని తీర్చాల్సిన అవసరం ఉంది .!

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :