Saturday, 18 May 2024 09:42:13 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఉయ్యూరులో నిషేధిత థాయ్‌ నత్తల పెంపకం.. ఒక్కోటి 50 సెంట్ల భూమిని నాశనం చేయగలదు

Date : 26 October 2023 10:27 AM Views : 63

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : నత్తలు. వీటిని రకరకాలుగా వాడుతుంటారు. చైనా వంటి దేశాల్లో తింటారు.. అమెరికాలో వైద్యానికి ఉపయోగిస్తున్నారు. అయితే ఈ నత్తలను ఏపీలో ఓ వ్యక్తి ఇష్టంగా పెంచుకుంటున్నాడు. అందులోనూ భారత్‌లో నిషేధించిన థాయ్‌లాండ్‌ నత్తలను తీసుకొచ్చి మరీ పెంచుతున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో వెలుగుచూసింది. నిషేధిత థాయ్‌లాండ్‌ నత్తలు ఉయ్యూరులోని.. కాటూరు రోడ్డు శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థ ప్రాంగణంలో కనిపించాయి. థాయిలాండ్ కు చెందిన ఈ నత్తల పెంపకంపై భారత సర్కార్‌ ఎప్పుడో బ్యాన్‌ చేసింది. కాని విశ్వశాంతి విద్యాసంస్థల చైర్మన్‌ కుమారుడు మాత్రం తమ విద్యాసంస్థ ప్రాంగణంలోనే పెంచుతున్నాడు. వాటికోసం ప్రత్యేకంగా ట్యాంకులు కట్టించి పెంపకాన్ని చేపట్టాడు. ఇటీవల నత్తల పెంపకంపై విశ్వశాంతి విద్యా సంస్థల అధినేత రెండవ కుమారుడు మాదల చంద్రశేఖర్… యూట్యూబ్‌ వీడియో చేసి ఆన్‌లైన్లో పోస్ట్‌ చేశాడు. దీనికి మంచి వ్యూస్‌ వచ్చాయి. కాని.. ఆ వీడియో చూసిన వారిలో బయాలజీ ఎక్స్‌పర్టులు కూడా ఉండడం.. వారు ఈ నత్తల విషయంలో అప్రమత్తంగా ఉండి సంబంధిత శాఖ అధికారులను సమాచారం ఇచ్చారు. జీవ జాతుల నియంత్రణ రక్షిత విభాగం అధికారులు విశ్వశాంతి ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన ట్యాంకులను పరిశీలించారు. నత్తలు బ్యాన్‌ చేయబడిన థాయిలాండ్‌ జాతికి చెందినవి కావడంతో.. వివరాలు నమోదు చేసుకుని పోలీసులను ఫిర్యాదుచేశారు.. ఈ నత్తలు చాలా ప్రమాదకరమని చెబుతున్నారు అధికారులు. ఈ ట్యాంకుల నుంచి ఒక్క నత్త బయటకు వచ్చినా.. ఆ ఒక్కటి 50సెంట్ల పొలాన్ని నాశనం చేయగదని అంటున్నారు అధికారులు. అవి పెట్టే గుడ్ల వల్ల మరింతగా వ్యాప్తి చెంది.. ముప్పు ఇంకా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యాసంస్థల్లో ప్రమాదకర నత్తల పెంపకంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. థాయిలాండ్ నుంచి నత్తలను తీసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. కీలక సమాచారం రాబడుతున్నారు. థాయిలాండ్ లో కొనుగోలు చేసినట్లుగా బిల్లులు చూపించాలని కోరగా.. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. అధికారులు మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ.. నత్తలు ఇండియా వరకు ఎలా వచ్చాయనే అంశంపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు థాయిలాండ్ నుంచి నత్తలను జలమార్గంలో తీసుకొచ్చారా..? లేక విమానంలో తరలించారా…? అసలు థాయ్‌లాండ్‌ నత్తలను ఇక్కడ ఎందుకు పెంచుతున్నారు. ఈ నత్తలను పెంచి.. ఇంకెక్కడికి ఎక్స్‌పోర్ట్ చేయాలని చూస్తున్నారు? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై అధికారులు ఆరాతీస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :