Saturday, 18 May 2024 01:11:19 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఏపీలో జోరుగా సాగుతోన్న వైసీపీ బస్సు యాత్ర.. అన్ని వర్గాలను ఆదుకున్న ఘనత జగన్‌దే అంటూ..

Date : 29 October 2023 09:42 AM Views : 84

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : దేశ చరిత్రలో సామాజిక న్యాయం అనే మాటకు సార్థకత చేకూర్చిన ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు వైసీపీ నేతలు. అన్ని వర్గాలకూ పెద్దపీట వేసింది జగన్‌ ప్రభుత్వమేనన్నారు. ఏపీలో వైసీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర జోరుగా సాగుతోంది. శనివారం మూడోరోజు భీమిలి, ప్రొద్దుటూరు, బాపట్లలో బస్సు యాత్ర జరిగింది. సామాజిక సాధికార యాత్ర పేరుతో వైసీపీ చేపట్టిన బస్సు యాత్ర శనివారంతో మూడవ రోజుకు చేరింది. దక్షిణాంధ్రకు సంబంధించి కడప జిల్లా ప్రొద్దుటూరులో బస్సు యాత్ర జరిగింది. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ బీద మస్తాన్ రావు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. తండ్రికి మించిన తనయుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారని, ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు నేతలు. మధ్యాంధ్రకు సంబంధించి శనివారం బాపట్ల జిల్లాలో సామాజిక సాధికార బస్సు యాత్ర సాగింది. పీవీ పాలెం నుంచి బాపట్ల వరకూ జరిగిన యాత్రలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మంత్రి జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ జరిగింది. ఉత్తరాంధ్రలోని భీమిలి నియోజకవర్గంలో ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి బస్సు యాత్రను ప్రారంభించారు. చంద్రపాలెం, మధురవాడ, తగరపువలసలో యాత్ర సాగింది. నాడు-నేడు కార్యక్రమానికి సంబంధించి మధురవాడలో స్కూళ్లను పరిశీలించారు. విద్యార్థులు, టీచర్లతో ముచ్చటించారు నేతలు. శనివారం మధ్యాహ్నం తర్వాత తగరపువలస ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌లో బహిరంగసభ జరిగింది. భీమిలి బస్సుయాత్రలో మంత్రులు బొత్స, శీదిరి, కారుమూరి, మేరుగ నాగార్జున పాల్గొన్నారు. నవంబర్ 9 వరకు సాగే బస్సు యాత్రకు రేపు విరామం. సోమవారం పాడేరు, దెందులూరు, ఉదయగిరి మీదుగా వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సాగనుంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :