Saturday, 18 May 2024 01:42:03 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

ఏపీ ఎస్సై తుది రాత పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి..

Date : 07 October 2023 02:45 PM Views : 71

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై ఉద్యోగ నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్షల హాల్‌టికెట్లను ఏపీ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. అభ్యర్థులు సంబంధిత వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ 12వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నియామక బోర్డు తెల్పింది. కాగా మొత్తం 411 ఎస్సై ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. AP SI Mains 2023 Hall Tickets: ఏపీ ఎస్సై తుది రాత పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి.. అమరావతి, అక్టోబర్‌ 6: ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై ఉద్యోగ నియామకాలకు సంబంధించి తుది రాత పరీక్షల హాల్‌టికెట్లను ఏపీ పోలీసు నియామక మండలి విడుదల చేసింది. అభ్యర్థులు సంబంధిత వివరాలను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ 12వ తేదీ వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నియామక బోర్డు తెల్పింది. కాగా మొత్తం 411 ఎస్సై ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రిలిమినరీ పరీక్షల్లో దాదాపు 31,193 మంది అభ్యర్ధులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరిలో 27,590 మంది పురుషులు, 3,603 మంది మహిళలు ఉన్నారు. పీఎంటీ/పీఈటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్‌ 14, 15 తేదీల్లో తుది రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు APSLPRB ఇప్పటికే ప్రకటించింది. ఎస్సై మెయిన్స్‌ పరీక్ష మొత్తం నాలుగు పేపర్లకు ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. మిగతా రెండు పేపర్లు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. అక్టోబర్ 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 1 పరీక్ష ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. ఈ రెండు పరీక్షలు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. ఇక అక్టోబర్‌ 15న జరిగే పరీక్ష కూడా రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 3 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 4 పరీక్ష ఉంటుంది. ఈ రెండు పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఎస్సై మెయిన్స్‌ పరీక్షలకు విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎస్సై అభ్యర్ధులకు సెప్టెంబర్‌లో ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ)లను పోలీసు నియామక మండలి నిర్వహించింది. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సివిల్‌) పోస్టులను పురుషులు, మహిళలను ఎంపిక చేస్తారు. రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ పోస్టులకు కేవలం పురుషులను మాత్రమే ఎంపిక చేయనున్న విషయం తెలిసిందే.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :