Saturday, 18 May 2024 10:51:45 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రెండో దశ సామాజిక సాధికార యాత్రకు తరలివస్తున్న జనం.. సంక్షేమాన్ని వివరిస్తూ సాగుతున్న రథం

Date : 24 November 2023 08:30 AM Views : 123

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇవాళ బొబ్బిలి, కడప, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు నిర్వహించారు. వైసీపీ సామాజిక సాధికార యాత్రతో కడప నగరం జనసంద్రంగా మారింది. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ఆధ్వర్యంలో కడప నియోజకవర్గంలో బస్సు యాత్ర జరిగింది. ఈ యాత్రకు సంబంధించి ఏర్పాటు చేసిన సభలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎంపీ అవినాష్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. పేదల తలరాత మార్చాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో జరిగిన వైసీపీ సామాజిక సాధికార యాత్రలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా.. వైసీపీది పేదల పక్షపాత ప్రభుత్వం అన్నారు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. చంద్రబాబు మాటల్లో నిజం ఉండదు.. హామీలు అమలు కావు.. అని ఆరోపించారు. ఇక కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరిగిన వైసీపీ బస్సు యాత్రకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని.. జై జగన్‌ నినాదాలతో హోరెత్తించారు. ఈ బస్సు యాత్రలో మంత్రులు పినిపె విశ్వరూప్, మేరుగు నాగార్జున, ఎంపీలు వంగా గీత, నందిగం సురేష్‌తోపాటు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సామాజిక సాధికారతలో దేశానికే రోల్‌ మోడల్‌ సీఎం జగన్‌ అని కొనియాడారు మంత్రి పినిపె విశ్వరూప్‌. పేదల కోసం, భావితరాల భవిష్యత్‌ కోసం ఆలోచించే నేత జగన్‌ అని చెప్పారు. మొత్తంగా.. ఏపీలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార యాత్ర రెండో దశ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఎలాంటి సంక్షేమ ఫలాలు అందాయో వివరిస్తున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :