జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి రైల్వే జంక్షన్ దగ్గర రెండు రైళ్లు ఢీకొన్నాయి. రాయగాడ ప్యాసింజర్ను వెనుక నుంచి పలాస రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సిగ్నల్ కోసం ఆగిన ప్యాసింజర్ను పలాస ప్యాసింజర్ ఢీకొంది. పట్టాలు తప్పిన విశాఖ- రాయగడ ప్యాసింజర్ మూడు బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందగా, సుమారు 40 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలంలో సుమారు 14 అంబులెన్స్లకు పైగా తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఘటన స్థలానికి చేరుకున్న మంత్రి బోత్స సత్యనారాయణ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పట్టాలు క్రాస్ చేస్తుండగా ఒక ట్రైన్ను మరో రైలు ఢీకొంది. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యం అవుతోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా కలెక్టర్, ఎస్సీని సంఘటన స్థలానికి హుటాహుటిన పంపించింది. అయితే ఘటనకు సంబంధించి వివరాలన్న ఎప్పటికప్పుడు తనకు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ, విశాఖ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనరేటర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను అందిస్తున్నారు అధికారులు. 08912746330, 08912744619, 8106053051, 8106053052, 8500041670, 8500041671లకు సహాయం, సమాచారం కోసం సంప్రదించవచ్చు.
Admin