Saturday, 18 May 2024 12:36:36 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

యూట్యూబ్ లింక్ క్లిక్ చేసి రూ.7.50 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. నమ్మకంతోనే నయవంచన!

Date : 13 October 2023 12:35 PM Views : 73

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : సైబర్ నేరగాళ్ళు ఎంత మందికి, ఎన్ని రకాలుగా కుచ్చు టోపీ పెట్టినా పబ్లిక్‌లో ఏ మాత్రం మార్పు రావటం లేదు. సైబర్ దందా ఈ పేరు తెలియాని వారే ఉండరు. మారు మూలపల్లెటూర్ల నుంచి పెద్ద పెద్ద సిటీల వరకు ఇందులో అందరు బాధితులే. ముసలీ ముతకా, చిన్న పెద్ద, చదువుకున్న వారు, చదువులేని వారు ఎవరికైన సైబర్ నేరగాళ్ళు గేలం వేస్తే అట్టే దొరికిపోతున్నారు. ఎలా వేస్తారో తెలియదు. ఏ రకంగా వస్తారో తెలియదు.. కానీ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ అయ్యాక కానీ మోసపోయాం అని గుర్తించలేకపోతున్నాం. ప్రతి రోజు ఏదో ఒక రకంగా పబ్లిక్ నుంచి కోట్లలో దోచేస్తున్నారు. ఇందులో తెలిసి మోసపోయే వారు కొంతమంది అయితే మోసపోతామేమోననే అనుమానంతో నిజంగానే మోసపోయే వారు మరికొంతమంది. ఇక తాజాగా సైబర్ నేరగాళ్ల చేతుల్లో చదువుకున్న ఓ యువతి ఏకంగా 7.50 లక్షలు పోగొట్టుకుంది. గత కొద్దీ కాలంగా సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నవారిలో యువతే ఎక్కువమంది ఉంటున్నారు. మోసపోయిన యువతిది కృష్ణ జిల్లా పామర్ మండలం తోట్లవల్లూరు గ్రామం సాఫ్ట్‌వెర్ ఉద్యోగం చేస్తున్న ఈ యువతి యూ ట్యూబ్ చూస్తుండగా వచ్చిన ఒక లింక్ ద్వారా తన ఖాతాలో ఉన్న డబ్బును పోగొట్టుకుని లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించింది. రూ.7.50 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చెయ్యటంతో అసలు వ్యవహారం బయటపడింది. యూట్యూబ్ చూస్తున్న యువతికి టెలికం పేరుతో తొలుత ఒక లింకు వచ్చింది. దాంట్లో రూ.వంద పెట్టుబడి పెడితే రూ.200 వస్తాయని ఉండటంతో మొదట ట్రయిల్‌గా కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టింది. ఆమె పెట్టిన డబ్బు కంటే అధిక మొత్తంలో డబ్బు రావడంతో అందులో ఉన్న పెట్టుబడులు అనుసరిస్తూ పెడుతూనే ఉంది. తొలిసారి 1000 పంపిస్తే రూ.1600 వచ్చాయని, తర్వాత రూ.6000 పంపిస్తే రూ.12000 వచ్చాయని, ఆఫర్ పేరుతో రూ 10000 వేస్తే రూ.20,000 డబ్బులు రావటంతో.. యువతకి నమ్మకం కుదిరింది. దీంతో ఒక్కసారిగా అధిక మొత్తంలో పెట్టింది. పెట్టిన డబ్బులు రాకపోగా టాస్క్ లంటూ.. అదంటూ.. ఇదంటూ మరింత డబ్బులు పెడుతూ మొత్తం డబ్బులన్నీ పోగొట్టుకున్నాక పొసపోయానని గ్రహించింది. దీంతో చేసేది లేక పోలీసులని ఆశ్రయించింది. దీనిపై కేస్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :