Saturday, 18 May 2024 10:36:13 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ పొత్తుపై క్లారిటీ వచ్చేనా

Date : 30 April 2023 04:45 PM Views : 104

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : తెలుగు రాజకీయాల్లో కీలయ పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 29వ తేదీ శనివారం హైదరాబాద్​ లోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​ భేటి అయ్యారు. ఈ మధ్య కాలంలో వీరిద్దరి భేటీ జరగటం ఇది మూడోసారి. ఓసారి బెజవాడలోని హోటల్ లో.. ఆ తర్వాత హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంట్లోనే సమావేశం జరిగింది. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ వీళ్లిద్దరు సమావేశం కావటం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉంటుందా లేదా.. పొత్తు ఉంటే ఎన్ని సీట్లకు అనే అంశాలపై టీడీపీ, జనసేన పార్టీల్లో ఆసక్తికర డిస్కషన్ కు తెర తీసింది. ఎర్రగొండపాలెం ఘటనపై చంద్రబాబుకు పవన్​ కళ్యాణ్​ సంఘీభావం తెలిపారు​. నిన్న (ఏప్రిల్​ 28) ఎన్టీఆర్​ శతజయంతి ఉత్సవాల్లో రజనీ కాంత్​ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతల రియాక్షన్​ గురించి చర్చించారు. ఢిల్లీ టూర్​ తరువాత పవన్​ కళ్యాణ్​ సైలంటయ్యారు. పవన్​ ఢిల్లీ టూర్​ టీడీపీ, బీజేపీలను ఒకతాటిపైకి తెచ్చే లక్ష్యంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన జరిగింది. రెండ్రోజులు హస్తినలో పర్యటించిన పవన్ కళ్యాణ్ పలువురు బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను బీజేపీ పెద్దలకు వివరించే ప్రయత్నం చేశారు.జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేయాలని గతంలో జనసేనాని బీజేపీ పెద్దల దృష్టి తీసుకెళ్లారు. వైసీపీకి వ్యతిరేకంగా తాము బలంగా పోరాడతామని ప్రతిపక్షాలు సంకేతాలు వస్తున్నాయి. జేపీ నడ్డాతో భేటీ అయిన తరువాత పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని ప్రకటించారు. కాని పొత్తుల విషయంలో మేలు చేసే నిర్ణయం ఉంటుందని గతంలోనే పవన్​ చెప్పారు. ఈ భేటి విషయంపై పవన్​ కళ్యాణ్​ బీజేపీ పెద్దలతో చర్చించారా .. లేదా అన్న విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :