Saturday, 18 May 2024 01:42:00 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

విశాఖలో ప్రభుత్వ శాఖల ఏర్పాటులో మరో ముందడుగు.. కీలక ఆదేశాలు జారీ..

Date : 14 October 2023 01:17 PM Views : 70

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : విశాఖపట్నం లో సీఎం క్యాంప్ కార్యాలయం,ప్రభుత్వ శాఖల ఏర్పాటుపై ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తుంది.ఇప్పటికే గత మూడు రోజుల్లో రెండు కీలక జీవోలు జారీ చేసింది ప్రభుత్వం.జీవో ఎంఎస్ 2004,జీవో ఎంఎస్ 2015 ద్వారా విశాఖపట్నం లో ప్రభుత్వ శాఖల ఏర్పాటుపై స్పష్టత ఇచ్చింది..ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి చేయడంలో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయం తో పాటు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని జీవోల్లో పేర్కొంది..మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో అభివృద్ధి చేయడం,ముఖ్యమంత్రి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరువ కావడానికి విశాఖపట్నం కేంద్రంగా సమీక్షలు చేయాల్సి ఉంటుందని జీవో ఎంఎస్ 2004లో ప్రభుత్వం పేర్కొంది.ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆ జీవోలో పేర్కొంది.సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి తో పాటు అధికారులు కొన్ని రోజులపాటు అక్కడే ఉండాల్సి వస్తుందని,క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.జీవో ఎంఎస్ 2004 ఆధారంగా మరో జీవో 2015ను జారీ చేసింది..విశాఖపట్నంలో ప్రభుత్వ శాఖల కు అవసరమైన వసతి సదుపాయాలు కల్పించేందుకు ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది.ఈ కమిటీలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి,ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తో పాటు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు.ప్రణాళికా శాఖ నోడల్ ఏజన్సీ గా వ్యవహరించనుంది…ప్రభుత్వం నియమించిన కమిటీ వెంటనే తన పని ప్రారంభించింది. ఏ శాఖకు ఎంత స్థలం కావాలో వివరాలు ఇవ్వాలని ఆదేశాలు.. విశాఖపట్నం లో ప్రభుత్వ శాఖల ఏర్పాటుకు అవసరమైన వసతిని చూసే కమిటీ వెంటనే తన పని ప్రారంభించింది.ప్రభుత్వం లో ఉన్న అన్ని శాఖలకు సాదారణ పరిపాలన శాఖ నుంచి అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది…జీవో ఎంఎస్ 2004,జీవో ఎంఎస్ 2015 ల ఆధారంగా చూపిస్తూ సర్కులర్ జారీ చేసింది. దీని ప్రకారం అన్ని శాఖలు తమ శాఖ మంత్రికి అలాగే శాఖల ఏర్పాటుకు కావాల్సిన స్థలం వివరాలు కోరుతూ సర్కులర్ పంపించింది..ఈ సర్కులర్ లో రెండు ప్రతిపాదనలు కావాలని కోరింది.ముందుగా సంబంధిత శాఖకు చెందిన మంత్రి కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భవనాన్ని లేదా స్థలాన్ని చూసారా..?ఒకవేళ చూస్తే ఏ ప్రాంతంలో చూసారు?ఎన్ని చదరపు గజాల విస్తీర్ణంలో ఎంపిక చేసారని వివరాలు అడిగింది కమిటీ..ఒకవేళ స్థలం ఎంపిక చేయనట్లైతే ఎన్ని చదరపు గజాల విస్తీర్ణం అవసరమో తెలపాలని స్పష్టం చేసింది..ఇక రెండో విభాగంలో సంబంధిత శాఖకు అవసరమైన కార్యాలయం ఏర్పాటుకు కావాల్సిన వివరాలు కోరింది.శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి లేదా కార్యదర్శి,శాఖాధిపతులు ఉండేలా కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భవనాన్ని లేదా స్థలాన్ని చూసారా..?ఒకవేళ చూస్తే ఏ ప్రాంతంలో చూసారు?ఎన్ని చదరపు గజాల విస్తీర్ణంలో ఎంపిక చేసారని వివరాలు అడిగింది కమిటీ..ఒకవేళ స్థలం ఎంపిక చేయనట్లైతే ఎన్ని చదరపు గజాల విస్తీర్ణం అవసరమో తెలపాలని పేర్కొంది… అక్టోబర్ 17వ తేదీలోగా అన్ని వివరాలు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ వివరాల ఆధారంగా విశాఖలో మంత్రులు, సంబంధిత శాఖల కార్యాలయాలు ఏర్పాటుకు భవనాలు ఎంపిక చేయనుంది కమిటీ.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :