జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మరొకరిని అరెస్ట్ చేసింది. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనను మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కేసులో ఈడీ రాఘవను ఇప్పటికే పలుసార్లు విచారించింది. రాఘవ బాలాజీ గ్రూప్ చైర్మన్ గా ఉన్నారు. సౌత్ గ్రూప్లో రాఘవ కీ రోల్ పోషించినట్లు తెలుస్తోంది.
Admin