Saturday, 18 May 2024 09:42:19 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

‘పెళ్లికి నీకు పిల్లనెవ్వరు ఇస్తార్రా’.. ఈ మాట ఆ తండ్రికి శాపమైంది.. సీన్ కట్ చేస్తే.!

Date : 15 October 2023 08:27 AM Views : 75

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ప్రకాశం జిల్లా, అక్టోబర్ 14: పెళ్లి కావాలి… నాకు పెళ్లి కావాలి… అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన ఓ చిన్నారి వీడియో తరహాలోనే ఓ కుర్రాడు తనకు పెళ్లి కావాలంటూ తండ్రిని వేధించడం మొదలుపెట్టాడు. ఆ కుర్రాడి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో పాటు ఎలాంటి ఉపాధి లేకపోవడంతో కొడుక్కి పెళ్లి చేసేందుకు ఆ తండ్రి సుముఖత వ్యక్తం చేయలేదు. అంతే కాకుండా నీకు పిల్లనెవరు ఇస్తార్రా అంటూ పెళ్లి కోసం వేధిస్తున్న కొడుక్కి నచ్చ జెప్పేందుకు ప్రయత్నించాడు. అదే ఆ తండ్రి చేసిన తప్పైంది. తనకు తండ్రి పెళ్లి చేయకపోవడంతో కోపం పెంచుకున్న ఆ కొడుకు ఉన్మాదిగా మారిపోయాడు. తన తండ్రి తన మాట వినడం లేదని విపరీతమైన కోపంతో కత్తితో గొంతుకోసి చంపేశాడు. అనంతరం తానూ గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. పెళ్లి చేయలేదనే నెపంతో కుమారుడు తండ్రిని హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం కనకదుర్గమ్మ కాలనీలో చోటు చేసుకుంది. తండ్రి బాల భద్రాచారిని ఇంటి నుంచి బయటకి తీసుకెళ్లిన కొడుకు గురునారాయణాచారి పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆయన గొంతు కోశాడు. తర్వాత గరునారాయణ కూడా గొంతు కోసుకున్నాడు. స్వల్ప గాయాలైన అతన్ని స్థానికులు ఒంగోలు తరలించారు. అనంతరం సమాచారం అందుకుని ఘటనా స్థలాన్ని డీఎస్పీ వీరారాఘవరెడ్డి పరిశీలించారు. రక్తస్రావమైన కొడుకును ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కొడుకు మానసిక స్థితి బాగాలేదని, తనకు తండ్రి పెళ్లి చేయడం లేదన్న కారణంగా ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. గత కొంతకాలంగా తనకు పెళ్లి చేయాలని కొడుకు గురునారాయణాచారి తన తండ్రి బాలభద్రాచారిని వేధిస్తున్నాడు. తన కొడుకు మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో పెళ్లి చేసేందుకు నిరాకరించాడు ఆ తండ్రి. అంతేకాకుండా ఉద్యోగం, సద్యోగం లేని నీకు పిల్లను ఎవరు ఇస్తార్రా… అంటూ మంచి మాటలు చెప్పిన తండ్రిపై కోపం పెంచుకున్న కొడుకు గురునారాయణాచారి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :