Saturday, 18 May 2024 10:36:16 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

భారీగా పెరిగిన రైల్వే ప్రయాణికుల సంఖ్య.. రికార్డ్ సృష్టిస్తున్న దక్షిణ మధ్య రైల్వే

Date : 16 November 2023 11:57 PM Views : 87

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : సాధారణ మరియు స్లీపర్ తరగతి ప్రయాణీకుల సంఖ్యలో గణనీయమైన వృద్ధిని నమోదుచేసిన దక్షిణ మధ్య రైల్వే వివిధ వర్గాల ప్రయాణికులకు సేవలందించడంలో ముందంజలో ఉంది. జోన్ పరిధిలో అధిక సంఖ్యలో ప్రయాణికులకు రైలు సేవలను అందించడానికి, కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం, ప్రత్యేక రైళ్లను నడపడం, అదనపు స్టాపేజ్‌లు మరియు కోచ్‌ల సంఖ్య పెంపుదల వంటి అనేక చర్యలను చేపట్టింది. దీని పర్యవసానంగా, దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల విభాగంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనగా 2023-24 అక్టోబర్ వరకు సాధారణ మరియు స్లీపర్ తరగతి ప్రయాణీకుల సంఖ్యలో పెరుగుదలను నమోదు చేసింది. దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో మొత్తం 15.75 కోట్ల మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్ని అందించింది. ఇది జోన్ మొత్తం ప్రయాణికుల సంఖ్యలో 90.9%. ఇందులో జనరల్ & స్లీపర్ కోచ్‌లలో ప్రయాణించిన వారి సంఖ్య 14.32 కోట్లు మరియు ఎసి కోచ్‌లలో ప్రయాణించిన వారి సంఖ్య 1.43 కోట్లు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జోన్‌లో నాన్‌ ఏసీ కోచ్‌లలో 1.01 కోట్లు మరియు ఏసీ కోచ్‌లలో 27 లక్షల అదనపు ప్రయాణికులు రాకపోకలు సాగించారు. దక్షిణ మధ్య రైల్వే గమ్యస్థానాల వారీగా మరియు పండుగల వంటి ప్రత్యేక సందర్భాలలో ప్రయాణీకుల అధిక డిమాండ్ ఉన్న మార్గాలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. దీని ప్రకారం, వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే రోజుకు 664 రైళ్లను నడిపింది. రోజు వారీగా నడపబడుతున్న మొత్తం రైళ్లలో, 349 మెయిల్/ఎక్స్ ప్రెస్ రైళ్లు, 209 ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లు, 106 ఎమ్ఎమ్‌టిఎస్ రైలు ఉన్నాయి. భారతీయ రైల్వేలు జాతీయ స్థాయిలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకు 10,748 రైళ్లను నడుపుతోంది. సాధారణ మరియు స్లీపర్ క్లాస్ కోచ్‌లలో మొత్తం 372 కోట్ల మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థలాలకు చేరవేసింది. అదే సమయంలో 18.2 కోట్ల మంది ప్రయాణికులు ఏసీ కోచ్‌లలో ప్రయాణించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోల్చినప్పుడు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు 38 కోట్ల మేర ప్రయాణికులు నాన్ ఏపీ కోచ్‌లలో (సాధారణ & స్లీపర్). 3.1 కోట్ల మేర ప్రయాణికులు ఏసీ కోచ్‌లలో అదనంగా ప్రయాణించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :