Saturday, 18 May 2024 01:59:53 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

నవంబర్‌ 1వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగింప.. స్కిల్‌ కేసులో చంద్రబాబు రిమాండ్‌ పొడిగించిన ఏసీబీ కోర్టు

Date : 19 October 2023 07:07 PM Views : 67

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : తెలుగు దేశం పార్టీ(టీడీపీ) చీఫ్ చంద్రబాబుకు మరో సారి ఉరట లభించలేదు. స్కిల్‌ స్కాం కేసులో రిమాండ్‌ను నవంబర్ 1వ తేదీ వరకు పొడిగించింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించాలని ఆదేశించింది. దీంతో చంద్రబాబు రిమాండ్‌ను నవంబర్ 1వ తేదీ వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. గతంలో ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌ ఇవాళ్టితో ముగియడంతో రాజమండ్రి జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌ను నవంబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని వెల్లడించింది. ఇదే సమయంలో తన సెక్యూరిటీ విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాను జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి అంటూ చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి తెలిపారు. అయితే ఈ విషయమై రాతపూర్వకంగా ఇవ్వాలని ఏసీబీ కోర్టు జడ్జి చంద్రబాబుకు సూచించారు. దీంతో చంద్రబాబు రాసే లేఖను తనకు పంపాలని ఏసీబీ కోర్టు జడ్జి రాజమండ్రి జైలు అధికారులను ఆదేశించారు. జైలు లోపల, బయట తన భద్రతపై కొన్ని అనుమానాలున్నాయని చంద్రబాబు జడ్జికి వివరించారు. హైకోర్టులో స్కిల్‌ కేసు పెండింగ్‌లో ఉందని చంద్రబాబుకు ఏసీబీ కోర్టు జడ్జి చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి అధికారులను జడ్జి అడిగారు. మెడికల్‌ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని అధికారులకు జడ్జి ఆదేశించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :