Saturday, 18 May 2024 01:11:17 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

రోజురోజుకీ పెరుగుతోన్న వెంకన్న ఆదాయం.. రికార్డు స్థాయిలో పెరిగిన డిపాజిట్లు..

Date : 16 November 2023 11:59 PM Views : 76

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : తిరుమల వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఆపద మొక్కుల స్వామికి కానుకలు సమర్పించే భక్తులు తిరుమలేశుడి ఆస్తుల విలువను పెంచుతున్నారు. వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా గత నాలుగేళ్లలో శ్రీవారి ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది. 2019 జూన్‌కు ముందు తిరుమలేశుడికి బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ డిపాజిట్‌లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో గురువారం మీడియా సమావేశం విర్వహించిన ఈఓ ధర్మారెడ్డి టీటీడీకి ఉన్న 24 బ్యాంకు ఖాతాల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ డిపాజిట్ల వివరాలను వెల్లడించారు. 2019 జూన్ 30 వరకు రూ. 13025.09 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండగా, 2023 అక్టోబర్ 31 నాటికి రూ. 17,816.15 కోట్లకు చేరుకున్నాయి. దీంతో గత నాలుగేళ్లలో శ్రీవారి ఆదాయం బ్యాంక్‌ల్లోని ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ. 4791.06 కోట్లకు పెరిగింది. ఇక బంగారు డిపాజిట్లు కూడా గణనీయంగా పెరిగాయి. టీటీడీ గోల్డ్ డిపాజిట్లు రెండు బ్యాంకుల్లో ఉన్నట్లు స్పష్టం చేసిన ఈఓ 2019 జూన్ 30 వరకు 7339.74 కేజీలు ఉండగా 2023 అక్టోబర్ 31 నాటికి 11,225.66 కేజీల బంగారం గోల్డ్ డిపాజిట్‌లుగా ఉంది. గత నాలుగేళ్లలో 3885.92 కేజీల బంగారం అదనంగా శ్రీవారి పేరుతో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో గోల్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 10786.67 కేజీలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 438.99 కేజీల గోల్డ్‌నుటీటీడీ డిపాజిట్ చేసింది. Dharma Reddy టీటీడీ పాలన, శ్రీవారి ఆస్తులపై పలు ఆరోపణలు అనుమానాలు వ్యక్తం చేసిన టీడీపీ నేతల కామెంట్స్ పై స్పందించిన టిటిడి ఈవో బ్యాంకుల్లో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారు డిపాజిట్లు వివారాలు ప్రకటించాల్సి వచ్చింది. టీటీడీ పాలనపై ఆరోపణలు చేసిన టీడీపీ నేతలను కూడా టీటీడీ ఈఓ ధర్మారెడ్డి చర్చకు ఆహ్వానించారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :