Saturday, 18 May 2024 11:57:28 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

జనసేన, టీడీపీతో పొత్తుకు తాము సిద్ధమంటున్న సీపీఐ.. బీజేపీ పక్కన పెట్టాలని సూచన..

Date : 10 October 2023 09:37 AM Views : 65

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఓ వైపు తెలంగాణాలో ఎన్నికల నగారా మోగింది.. మరోవైపు ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ పొత్తులపై ఎన్నికల్లో పోటీ చేసే ఎత్తులపై రాజకీయనేతలు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేనలు కలిసి వెళ్తాయని ప్రకటించారు. తాజాగా సీపీఐ కూడా తన స్వరం వినిపించింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ను కేంద్రం పట్టించుకోవడం లేదు.. కోపంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ రామకృష్ణ. అంతేకాదు జనసేన, టీడీపీతో పొత్తుకు తాము సిద్ధం ఉన్నామని స్పష్టం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై బీజేపీ పెద్దలకు కోపంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బీజేపీ పవన్‌ను పట్టించుకొని పరిస్థితిలో లేదన్నారు. పవన్‌ కళ్యాణ్ ఎన్డీఏ ఉండి టీడీపీకి సపోర్ట్ చేయడం హర్షం దగ్గ విషమన్నారు. ఆయన గట్స్ ను మెచ్చుకొని తీరాల్సిందేనన్నారు రామకృష్ట. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా టిడిపితో పొత్తు పెట్టుకోవడంతో పవన్‌ను తాము అభినందిస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని పక్కనబెట్టి టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఏం కలిసి పోటీ చేయాలని కోరారు. ఈ పొత్తుతో జగన్‌ ను ఓడించగలమని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఏపీ నష్టపోతుందన్నారు. కర్ణాటకలో ఎన్నికలు వస్తే.. అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల రావడంతో కృష్ణాజలాల పునః పంపిణీకి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.. ఏపికి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పారు రామకృష్ణ.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :