Saturday, 27 July 2024 07:57:07 AM
# రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా.. తదుపరి ఉత్తర్వుల వరకు ఎలాంటి చర్యలు వద్దు: హైకోర్టు

Date : 25 November 2023 08:21 AM Views : 151

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఇసుక కుంభకోణంలో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 30కి వాయిదా వేసింది. అలాగే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్లపై విచారణలు జరుగుతూనే ఉన్నాయి. ఇసుక కుంభకోణంలో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల ముప్పైకి వాయిదా వేసింది. ఇన్నర్‌ రింగ్‌ కేసులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్ కూడా హైకోర్టు ముందుకు వచ్చింది. దీనిపై విచారణను హైకోర్టును ఈ నెల 29కి వాయిదా వేసింది. అయితే ఈ కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని హైకోర్టు తెలిపింది. ఈ కేసులో బాబుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వవద్దని సీఐడీ తరపు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి 470 పేజీలతో అదనపు అఫిడవిట్‌ను ఏపీ సీఐడీ హైకోర్టుకు సమర్పించింది. మరో వైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ న్యాయవాదులు ప్రస్తావించారు. తమ పిటిషన్‌ను త్వరగా విచారించాలని కోరుతూ ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ కేసు మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణకు రావచ్చని ఏపీ సీఐడీ భావిస్తోంది. ఇసుక కుంభకోణంలో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా ఈ నెల 30న విచారణ చేపట్టనున్న హైకోర్టు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు బెయిల్‌ కేసు ఈ నెల 29కి వాయిదా తదుపరి ఉత్తర్వుల వరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలు వద్దన్న హైకోర్టు స్కిల్‌ స్కామ్‌ పిటిషన్‌ను సీజేఐ దృష్టికి తెచ్చిన ఏపీ సీఐడీ న్యాయవాదులు వచ్చే మంగళవారం పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :