Saturday, 18 May 2024 10:36:20 AM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

టీటీడీలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం

Date : 27 October 2023 10:58 AM Views : 67

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులను పర్మినెంట్‌ విధానంలో తీసుకోవడం విశేషం. ఇంతకీ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.? ఎలాంటి అర్హతలు ఉండాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. తిరుమల తిరుపతి దేవస్థానం నోటిఫికేషన్‌లో భాగంగా ఏఈఈ, ఏఈ, ఏటీవో వంటి ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్‌ 23వ తేదీని దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ఇంతకీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఏంటి.? ఎలా ఎంపిక చేస్తారంటే.. పైన పేర్కొన్ని ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌, హిందూ మతానికి చెందిన వారు మాత్రమే అర్హులు. ఇక విద్యార్హత విషయానికొస్తే.. బీఈ, బీటెక్‌ (సివిల్‌/మెకానికల్‌), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏఈఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 57,100 నుంచి రూ. 1,47,760 వరకు చెల్లిస్తారు. ఏఈ పోస్టులకు సెలక్ట్ అయిన వారికి నెలకు రూ. 48,440 నుంచి రూ. 1,37,220 వరకు జీతంగా చెల్లిస్తారు. ఏటీవో పోస్టులకు నెలకు రూ. 37,640 నుంచి రూ. 1,15,500 వరకు జీతంగా అందించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నవంబర్ 23వ తేదీతో ముగియనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :