Saturday, 18 May 2024 01:11:22 PM
# పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. # నేడు కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం.. # అక్కాచెల్లెళ్ల ప్రాణాలను తీసిన దాగుడు మూతల ఆట, ఫ్రీజర్‌లో ఇరుక్కుని మృతి # నేడే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు # పసిడి ప్రియులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

కారు వద్దు.. విద్యుత్‌ ద్విచక్ర వాహనమే మేలు.. సిబ్బందికి కలెక్టర్‌ డిల్లీరావు ఆదేశం

Date : 29 October 2023 09:46 AM Views : 65

జై భీమ్ టీవీ - ఆంధ్ర ప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అంటేనే పేరుకు తగ్గట్టుగా ఆయన నిర్ణయాలు సంచలనాత్మకంగా, ఆచరణయోగ్యంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ప్రతీరోజు ఆయన పాల్గొనే కార్యక్రమాలను చూస్తే ఆయన పనితీరు ఏమిటో ఇట్టే అర్ధమవుతుంది. కాలుష్య నివారణపై కలెక్టర్‌ డిల్లీరావు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఏదైనా మనం ఆచరించినప్పుడే ఎదుటివారికి చెప్పడంలో అర్ధం ఉంటుందన్న భావనతో వాహనాల వినియోగంలో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్‌ దగ్గర నుంచి సిబ్బంది వరకు వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం విద్యుత్‌ ద్విచక్ర వాహనాన్ని మాత్రమే వాడాలని, తాను కూడా విద్యుత్‌ ద్విచక్ర వాహనాన్ని ఉపయోగిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలుష్య వాతావరణాన్ని నియంత్రించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలను చైతన్య చేయడమే లక్ష్యం అన్నారు. వ్యక్తి గత అవసరాలకు కారును ఉపయోగించకుండా విద్యుత్‌ ద్విచక్ర వాహనాన్ని ఉపయోగించాలని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో పని చేసిన జిల్లా కలెక్టర్లు ఒక వాహనాన్ని ఉపయోగించటంతో పాటు వారివ్యక్తి గత అవసరాలు పనులకు మరో వాహనాన్ని వినియోగిస్తుంటారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీ రావు పిల్లలను ఉదయం సాయంత్రం స్కూల్‌కు తీసుకు వెళ్ళడం తీసుకురావడంతో పాటు నగరంలో షాపింగ్‌ పనులు యితర అవసరాలకు ఒక కార్‌ను వినయోగిస్తున్నారు. పర్యావణాన్ని పరిరక్షించేందుకు వాహన కాలుష్యాన్ని నివారించే చర్యలలో భాగంగా జిల్లా కలెక్టర్‌ నెడ్‌ కాప్‌ సహకారంతో అవేరా సంస్థ నుండి విద్యుత్‌ ద్విచక్ర వాహనం కొనుగోలు చేశారు. ఇకపై వ్యక్తి గత అవసరాలకు కారు వాడకాన్ని నిలిపి వేసి విద్యుత్‌ వాహనాన్ని ఉపయోగించాలని సిబ్బందిని ఆదేశించారు. తాను కూడా ఉదయం, సాయంత్రం వ్యక్తిగతంగా బయటకు వెళితే విద్యుత్‌ ద్విచక్ర వాహనం ఉపయోగించనున్నట్టు తెలిపారు. కలెక్టర్‌ ను ఆదర్శంగా తీసుకుని జిల్లా అధికారులు ఉద్యోగులు సాధ్యమైనంత వరకు ద్విచక్ర వాహనాలను వినియోగిస్తే నగరంలో కాలుష్యాన్ని కొంతమేరకు నివారించ డమేకాకుండా ప్రజలను కాలుష్య నివారణపై అవగాహన కల్పించేందుకు దోహదపడుతుందన్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :