Sunday, 08 September 2024 07:42:36 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ఆ ఇద్దరిపై వేటు.. ఈసారి డబుల్ ఎలిమినేషన్.. హింట్ ఇచ్చిన నాగ్..

Date : 08 October 2023 08:54 AM Views : 95

జై భీమ్ టీవీ - సినిమా / : మొత్తం పది మంది అభిప్రాయాల ప్రకారం అమర్ దీప్, గౌతమ్, తేజ అనర్హులుగా సెలక్ట్ అయ్యారు. అయితే ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ఎవరెవరు అనర్హులు అనేది ఆదివారం చెప్తానంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు నాగ్. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తం హౌస్ నుంచి ముగ్గురిని ఎలిమినేట్ చేస్తారని.. అందులో ఒకరిని సీక్రెట్ రూంకు పంపిస్తారని టాక్ వినిపిస్తుంది. Bigg Boss 7 Telugu: ఆ ఇద్దరిపై వేటు.. ఈసారి డబుల్ ఎలిమినేషన్.. హింట్ ఇచ్చిన నాగ్.. బిగ్‌బాస్ శనివారం ఎపిసోడ్‏లో ఒక్కొక్కరి ఆట కట్టించారు హోస్ట్ నాగార్జున. రావడంతోనే హౌస్ లో ఫస్ట్ కెప్టెన్ అయిన ప్రశాంత్ ను ప్రశంసించారు. ఆ తర్వాత టాస్కులలో అతి తెలివిగా ప్రవర్తించిన సందీప్, అమర్ దీప్ లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఒక్కొ జంటను నిలబెట్టి కడిగిపారేశారు. చివరగా ఇంట్లో ఉండేందుకు అనర్హులు ఎవరో చెప్పాలన్నారు. అందులో ఆల్ రెడీ హౌస్ మెట్ అయిన వారిని సెలక్ట్ చేయకూడదు అని.. మిగిలిన ఏడుగురిలో ముగ్గురిని మాత్రమే సెలెక్ట్ చేయాలన్నారు. దీంతో ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను తెలియజేశారు. అయితే మొత్తం పది మంది అభిప్రాయాల ప్రకారం అమర్ దీప్, గౌతమ్, తేజ అనర్హులుగా సెలక్ట్ అయ్యారు. అయితే ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం ఎవరెవరు అనర్హులు అనేది ఆదివారం చెప్తానంటూ సస్పెన్స్ క్రియేట్ చేశారు నాగ్. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తం హౌస్ నుంచి ముగ్గురిని ఎలిమినేట్ చేస్తారని.. అందులో ఒకరిని సీక్రెట్ రూంకు పంపిస్తారని టాక్ వినిపిస్తుంది. మొత్తం 14 మందితో మొదలైన బిగ్‌బాస్ గేమ్ లో ఇప్పుడు పది మంది మాత్రమే మిగిలారు. ఇప్పటివరకు వరుసగా అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీల, సింగర్ దామిని, రతిక ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఐదోవారం శోభా, సందీప్, ప్రశాంత్ మినహా మిగిలిన ఇంటి సభ్యులంతా నామినేట్ అయ్యారు. ఇక మొదటి రోజు నుంచే టాప్ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు శివాజీ. ఆ తర్వాత యావర్, గౌతమ్ కృష్ణ ఉండగా.. నాల్గవ స్థానంలో అమర్ దీప్,ఆ తర్వాతి స్థానాల్లో శుభ శ్రీ, ప్రియాంక, తేజ ఉన్నారు. అయితే ఐదో వారం ప్రియాంక ఎలిమినేట్ కానుందని టాక్ నడించింది. ఇప్పుడు అనుహ్యంగా ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ పేరు మారింది. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ వారం హౌస్ నుంచి ముగ్గురిని బయటకు పంపిస్తున్నారట. ఇప్పటివరకు డేంజర్ జోన్ లో ప్రియాంక, తేజ, శుభ శ్రీ ఉన్నారు. వీరిలో తేజ సేవ్ కాగా.. శుభ శ్రీ, ప్రియాంక ఒకేసారి ఎలిమినేట్ కానున్నారని.. అందులోనూ ప్రియాంకను పూర్తిగా ఎలిమినేట్ కాకుండా సీక్రెట్ రూంలో ఉంచారని సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండబోతున్న సంగతి తెలిసిందే. అర్జున్ అంబటి, పూజా మూర్తి, అంజలి పవన్, సింగర్ భోలే షావలితోపాటు నయని పావని కూడా ఎంట్రీ ఇస్తుందనే టాక్ నడుస్తోంది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :