Sunday, 08 September 2024 07:31:10 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

బంగారంలాంటి ఫోన్.. భారత్- పాక్ మ్యాచ్‌లో కాస్ట్లీ ఫోన్ పోగొట్టుకున్న హాట్ బ్యూటీ.. ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

Date : 16 October 2023 10:20 AM Views : 105

జై భీమ్ టీవీ - సినిమా / : అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ను చూసేందుకు పలువురు ప్రముఖ సెలబ్రిటీలు స్టేడియానికి తరలివెళ్లారు. హోంమంత్రి అమిత్ షా నుంచి పలువురు బాలీవుడ్ తారలు, టాలీవుడ్ నుంచి పలువురు భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో సందడి చేశారు . ఈ మ్యాచ్‌ని చూసేందుకు ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెల్లా కూడా అహ్మదాబాద్ వెళ్లారు. మ్యాచ్ చూస్తే మైమరచిపోయిన ఊర్వశి తన ఫోన్ ను పోగొట్టుకుంది. మ్యాచ్ చూస్తుండగానే తన అత్యంత ఖరీదైన ఐఫోన్ పోగొట్టుకున్నట్లు సోషల్ మీడియాలో తెలిపింది. అది మాములు ఐ ఫోను కాదంట..! ‘‘అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా నా 24 క్యారెట్ల బంగారు ఐఫోన్ పోగొట్టుకున్నాను. దయచేసి సహాయం చేయండి, ఎవరైనా మొబైల్‌ని కనుగొంటే, దాన్ని తిరిగి ఇవ్వండి లేదా నన్ను సంప్రదించండి” అని ఊర్వశి రౌతెల్లా సోషల్ మీడియాలోరాసుకొచ్చింది. అంతే కాదు ఆ పోస్ట్ లు అహ్మదాబాద్ పోలీసులను, నరేంద్ర మోడీ స్టేడియం యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేసింది. అయితే ఊర్వశి రౌతెలా చేసిన ఈ పోస్ట్‌ను చాలా మంది ట్రోల్ చేశారు. ఊర్వశి రౌతెల్లా అబద్ధాలు చెబుతోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అంటున్నారు. మరికొందరు గోల్డ్ ఫోన్ పొందిన వ్యక్తి అదృష్టవంతుడని, ఎవరైనా బంగారు ఫోన్ తిరిగి ఇస్తారా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఊర్వశి రౌతెలాకు ట్రోల్స్‌ కొత్తేమి కాదు. ఆమె ఏ చిన్న పోస్ట్ షేర్ చేసిన నెటిజన్స్ ఓ ఆటాడుకుంటారు. అలాగే క్రికెటర్ రిషబ్ పంత్ గురించి చెడుగా మాట్లాడినందుకు ఊర్వశి ట్రోల్ చేశారు. రిషబ్ మ్యాచ్‌లకు కూడా వెళ్లి అతడి ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. ఇక ఊర్వశి తెలుగులో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించి మెప్పించింది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీలో అదరగొట్టింది. రీసెంట్ గా స్కంద సినిమాలో కనిపించింది.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :