Sunday, 08 September 2024 07:48:42 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

షారుఖ్ ఖాన్‌కు బెదిరింపు కాల్స్.. భద్రత పెంచిన ప్రభుత్వం

Date : 09 October 2023 01:49 PM Views : 92

జై భీమ్ టీవీ - సినిమా / : బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పఠాన్, జవాన్ చిత్రాలు విజయం సాధించిన తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని షారుఖ్ ఖాన్ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో షారుఖ్ ఖాన్ కు భద్రత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం షారుక్ భద్రతను వై+గా మార్చారు. షారుఖ్ ఖాన్ లిఖిత పూర్వక ఫిర్యాదుతో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు షారుఖ్ కు విఐపి భద్రతను ఇవ్వాలని నిర్ణయించారు. షారుఖ్ ఖాన్ కు ఈ సెక్యూరిటీ కోసం ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. షారుక్ ఖాన్‌ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన జవాన్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు వసూల్ చేసింది. ఇక రీసెంట్ గా జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుక్. అట్లీ డైరెక్షన్ లో వచ్చిన జవాన్ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా రికార్డులను సృష్టించాయి. ఈ రెండు సినిమాల విజయం తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని షారుక్ రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. పఠాన్ 25 జనవరి 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 1050 కోట్ల రూపాయలను రాబట్టింది. అతని రెండో సినిమా జవాన్ కూడా పఠాన్ రికార్డును బద్దలు కొట్టింది. సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జవాన్ ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. రెండు బ్లాక్‌బస్టర్‌లను అందించిన తర్వాత, షారుక్‌ డంకి అనే సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ నెలలోఈ సినిమా విడుదల కానుంది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :