Sunday, 08 September 2024 07:34:49 AM
# నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. # పాస్ పుస్తకాలపై రాజముద్ర మాత్రమే ఉండాలి.. # రైతులకు గుడ్ న్యూస్.. రెండో విడత రుణ మాఫీకి రంగం సిద్ధం # రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ.. # పవన్ కళ్యాణ్ ఐడియాలజీ నచ్చి.. జనసేనలో చేరా: అంబటి రాయుడు # పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పోస్టులకు ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్ # అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు # కాంగ్రెస్ లో విలీనం -YSRTP అధ్యక్షురాలు షర్మిల # నేడు పులివెందులకు వైఎస్ షర్మిల # అధికారికంగా క్రిస్మస్ వేడుకలోపాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి # తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. # మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం # ఢిల్లీలో విపక్ష కూటమి భేటీ నేడు # నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి # కార్తీకమాసం చివరి సోమవారం.. # కార్తీకమాసం చివరి సోమవారం.. # నేడే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం తీర్పు.. # ఫ్రీ బస్‎లో మహిళకు టికెట్ జారీ చేసిన కండక్టర్ # ఛత్తీస్‎గఢ్ సీఎంగా ఆదివాసీ సరికొత్త రికార్డ్ # నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

అన్‌స్టాపబుల్ న్యూ సీజన్ రెడీ.. తొలి ఎపిసోడ్‌లో సందడి చేయనున్న భగవంత్ కేసరి టీమ్..

Date : 13 October 2023 01:08 PM Views : 97

జై భీమ్ టీవీ - సినిమా / : ఈ సీజన్ అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. విలక్షణ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఈ సీజన్‌ను తనదైన శైలిలో హోస్ట్ చేయబోతున్నారు. ప్రపంచ టాక్ షోస్‌లో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఓ మైలు రాయిని క్రియేట్ చేసి గేమ్ చేంజర్‌గా మారింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి బిగ్గెస్ట్ స్టార్స్‌తో పాటు ప్రముఖ రాజకీయ నాయకులైన నారా చంద్రబాబు నాయుడు, ప్రేక్షకులను అబ్బుర పరచటానికి వన్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా సిద్ధమైంది. బ్లాక్ బస్టర్ అయిన తొలి రెండు సీజన్స్‌ని ఫాలో అవుతూ ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ లిమిటెడ్ ఎడిషన్‌ను ఆహా ప్రారంభించనుంది. ఈ సీజన్ అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. విలక్షణ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఈ సీజన్‌ను తనదైన శైలిలో హోస్ట్ చేయబోతున్నారు. ప్రపంచ టాక్ షోస్‌లో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఓ మైలు రాయిని క్రియేట్ చేసి గేమ్ చేంజర్‌గా మారింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి బిగ్గెస్ట్ స్టార్స్‌తో పాటు ప్రముఖ రాజకీయ నాయకులైన నారా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి సహా పలువురు గత సీజన్స్‌లో ముఖ్య అతిథులుగా హారజైన సంగతి తెలిసిందే. ఇంత మంది గొప్ప గొప్ప స్టార్స్, స్టార్ పొలిటీషియన్స్ వచ్చిన షోగా ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పుడు ప్రారంభం కానున్న సీజన్‌లో ‘భగవంత్ కేసరి’ టీమ్ ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమైంది. తొలి ఎపిసోడ్‌లో ‘భగవంత్ కేసరి’ మూవీలో నటించిన ప్రధాన నటీనటులంతా పాల్గొనబోతున్నారు. డైరెక్టర్ అనీల్ రావిపూడి, నటి కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ఇందులో పార్టిసిపేట్ చేసి సినిమాలో యాక్ట్ చేయటంపై తమ అనుభవాలను తెలియజేయనున్నారు. ‘భగవంత్ కేసరి’ చిత్రంలో ఇప్పటి వరకు ఆడియెన్స్ చూడనటువంటి కొన్ని వీడియో స్నిప్పెట్స్‌తో పాటు ప్రేక్షకులను మెప్పించిన యాక్షన్ సన్నివేశాలు, సన్నివేశాల వెనుక కథనాలను ప్రత్యేకంగా చూపించనున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో దర్శకుడు అనీల్ రావిపూడి ప్రత్యేకంగా సినిమా మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ క్రియేషన్ వెనుకున్న క్రియేటివిటీ గురించి ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు. తెలుగు సినిమా అభిమానులకు ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ ఓ ప్రత్యేకమైన టాక్ షోగా గుర్తుండిపోయింది. ఈ షో వెనుకున్న క్రియేటివ్ టీమ్ దీనికొక సరికొత్త యూనిక్‌నెస్‌ను తీసుకొచ్చారు. అందుకనే ఆడియెన్స్ హృదయాల్లో ఇది అన్‌స్టాపబుల్‌గా అలా నిలిచిపోయింది. అక్టోబర్ 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ షోను చూడటం అసలు మిస్ కాకండి.

Shiva

Admin

మరిన్ని వార్తలు

Copyright © Jai Bheem Tv 2024. All right Reserved.

Developed By :